- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ బీజేపీపై మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. వినాయకచవితి వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించిందంటూ బీజేపీ ఆందోళనలు చేపట్టడంపై మండిపడ్డారు. దేశవ్యాప్తంగా వినాయకచవితిపై ఎలాంటి ఆంక్షలు ఉన్నాయో, రాష్ట్రంలోనూ అవే ఆంక్షలు అమలు చేస్తున్నామని నాని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అడ్రస్ లేని బీజేపీ విద్వేషాలు రగిల్చేందుకు కుట్రపన్నుతోందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు విగ్రహాలతోనూ, వినాయకచవితితోనూ రాజకీయం చేయడం షరా మామూలైపోయిందని విమర్శించారు. సీఎం జగన్ అన్ని మతాలను గౌరవిస్తారని చెప్పుకొచ్చారు. అలాంటి జగన్ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు బీజేపీ, టీడీపీలు కుట్రపన్నుతున్నాయని ధ్వజమెత్తారు. వినాయకచవితిపై పండుగపై బీజేపీ, టీడీపీ రాజకీయ లబ్ది పొందాలను చూస్తున్నాయని.. వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు.