కరోనా పట్ల ఆందోళన అవసరం లేదు: జూపల్లి

by  |
కరోనా పట్ల ఆందోళన అవసరం లేదు: జూపల్లి
X

దిశ, మహబూబ్‌నగర్: కరోనా వైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆయన కొల్లాపూర్ మండల పరిధిలోని సింగోటం, కోడెర్ మండలంలోని మైలారం గ్రామాల్లో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా కూలీలకు కరోనా వైరస్ పట్ల అవగహన కల్పిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చేతులను సబ్బుతో తరచూ శుభ్రం చేసుకోవాలనీ, నోటికి కర్చీఫ్ కట్టుకొని పనులకు వెళ్లాలని సూచించారు. వైరస్ నిర్మూనలకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

Tags: ex minister jupalli, corona, kollapur, mahabubnagar


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed