ఎక్కడా ఐకేపీ సెంటర్లను ఎత్తి వేయడం లేదు: కిషన్ రెడ్డి

by  |
ఎక్కడా ఐకేపీ సెంటర్లను ఎత్తి వేయడం లేదు: కిషన్ రెడ్డి
X

దిశ,వెబ్‌డెస్క్: కొత్త సాగు చట్టాలతో రైతులకు మేలే జరుగుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. బీజేపీ సెంట్రల్ జిల్లా పదాధికారుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లా డుతూ …‘లక్ష్య సాధనకు పార్టీ శ్రేణులు మరింత శ్రమించాలి. నూతన విద్యా విధానంతో విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. మాతృ భాషలో విద్యను ప్రోత్సహిస్తున్నాం. నూతన సాగు చట్టాల ద్వారా రైతు లకు పూర్తి స్వేచ్చ కలుగుతుంది. కొందరు స్వలాభం కోసం రైతులను పక్కదారి పట్టిస్తున్నారు. ఎక్కడా ఐకేపీ సెంటర్లను ఎత్తివేయడం లేదు. సాగు చట్టాలపై రైతులు సానుకూలంగా ఆలోచించాలి. టీఆర్ఎస్‌పై అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉంది’ అని అన్నారు.



Next Story

Most Viewed