- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజరోజుకూ పాజిటివ్ కేసుతో పాటు మరణాల సంఖ్య కూడా భయంకరంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కష్టకాలంలో వాస్తవాలు అందించి ప్రజలను చైతన్య పరచడం కోసం.. ప్రాణాలను పణంగా పెడుతున్న జర్నలిస్టులకు అభినందనలు తెలిపారు. కరోనా వైరస్ నుంచి జర్నలిస్టులంతా సురక్షితంగా ఉండాలని అన్నారు. కరోనా కలం యోధులు ప్రాణాలు కోల్పోతున్నారన్న వార్తలు కలిచివేశాయని తెలిపారు. అసువులు బాసిన అక్షర యోధులకు ట్విట్టర్ వేదికగా జోహార్లు తెలిపారు.
కరోనా కష్టకాలంలో ప్రజలకు వాస్తవాలు అదించడం ,ప్రజలను చైతన్య పరచడం కోసం ప్రాణాలను ఫణంగా పెడుతున్న జర్నలిస్లు సోదరులకు నా హృదయపూర్వక అభినందనలు. మీరంతా వైరస్ భారినుండి సురక్షితంగా ఉండాలి.
— Eatala Rajender (@Eatala_Rajender) April 29, 2021