ఈటల ట్వీట్.. జర్నలిస్టులకు అభినందనలు

by  |
Minister Etela Rajender
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజరోజుకూ పాజిటివ్ కేసుతో పాటు మరణాల సంఖ్య కూడా భయంకరంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కష్టకాలంలో వాస్తవాలు అందించి ప్రజలను చైతన్య పరచడం కోసం.. ప్రాణాలను పణంగా పెడుతున్న జర్నలిస్టులకు అభినందనలు తెలిపారు. కరోనా వైరస్ నుంచి జర్నలిస్టులంతా సురక్షితంగా ఉండాలని అన్నారు. కరోనా కలం యోధులు ప్రాణాలు కోల్పోతున్నారన్న వార్తలు కలిచివేశాయని తెలిపారు. అసువులు బాసిన అక్షర యోధులకు ట్విట్టర్ వేదికగా జోహార్లు తెలిపారు.

Next Story

Most Viewed