సర్వాంగ సుందరంగా టీఆర్ఎస్‌ ఆఫీస్‌లు.. ప్రారంభానికి సిద్ధం

by  |
సర్వాంగ సుందరంగా టీఆర్ఎస్‌ ఆఫీస్‌లు.. ప్రారంభానికి సిద్ధం
X

దిశ, జ‌న‌గామ: ఉమ్మ‌డి వరంగల్ జిల్లాలో ప్ర‌స్తుతం మూడు పార్టీ కార్యాల‌యాలు ప్రారంభోత్స‌వానికి సిద్ధంగా ఉన్నాయ‌ని, మ‌రో మూడు కార్యాల‌యాల‌ను నెల రోజుల్లోగా సిద్ధం చేస్తామ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. ఆయా కార్యాల‌యాల‌ను సీఎం కేసీఆర్, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల చేతుల మీదుగా ప్రారంభోత్స‌వాలు జ‌రిపిస్తామ‌ని మంత్రి తెలిపారు. జ‌న‌గామ పార్టీ కార్యాల‌యాన్ని మంత్రి ఎర్ర‌బెల్లి శ‌నివారం సంద‌ర్శించి నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు. సంబంధిత కాంట్రాక్ట‌ర్‌కి త‌గు సూచ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్ర‌తి జిల్లాకో పార్టీ కార్యాల‌యాన్ని నిర్మించాల‌న్న పార్టీ ఆదేశాల‌క‌నుగుణంగా అత్యంత వేగంగా ఉమ్మ‌డి జిల్లాలోని భూపాల‌ప‌ల్లి, హ‌న్మ‌కొండ (వ‌రంగ‌ల్)‌, ములుగు పార్టీ కార్యాల‌యాలు నిర్మాణాలు తుది ద‌శ‌లో ఉన్నాయ‌న్నారు. కొద్ది రోజుల్లోనే వాటి ప్రారంభిస్తామన్నారు. మ‌హ‌బూబాబాద్, జ‌న‌గామ జిల్లాల పార్టీ కార్యాల‌యాల‌ను నెల రోజుల్లోగా సిద్ధం చేస్తామ‌న్నారు. పార్టీ కార్యాల‌యాలు ప్రారంభ‌మైతే పార్టీ కార్య‌క‌లాపాల‌న్నీ జ‌రుపుకునే వీలు క‌లుగుతుంద‌న్నారు. పార్టీ శ్రేణుల‌కు కూడా అనుకూలంగా ఉంటుంద‌న్నారు. పార్టీ కార్యాల‌యాలు స‌ర్వాంగ సుంద‌రంగా స‌క‌ల స‌దుపాయాల‌తో నిర్మిస్తున్న‌ట్లు మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు.



Next Story

Most Viewed