రేవంత్ రెడ్డిపై ఏపీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు..

by  |
revanth-and-balineni
X

దిశ, వెబ్‌డెస్క్ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఏపీ చిన్నతరహా పరిశ్రమల మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ నేత చంద్రబాబు ఏం చెప్పమంటే రేవంత్ రెడ్డి అది చెబుతారని స్పష్టంచేశారు. రేవంత్ రెడ్డికి ఓ పార్టీ అంటూ ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి చంద్రబాబును పొగుడుతారని విమర్శించారు. ఆ తర్వాత విశాఖ అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టే రాజధానిగా నిర్ణయించామని చెప్పుకొచ్చారు.



Next Story

Most Viewed