విజయం మాదే.. ఓటు వేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

by  |
విజయం మాదే.. ఓటు వేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : శాసన మండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో విజయం మాదేనని, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దండే విఠల్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.



Next Story

Most Viewed