బయో ఏషియా సదస్సుకు సత్యనాదెళ్ల

by  |
బయో ఏషియా సదస్సుకు సత్యనాదెళ్ల
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏషియాలోనే అతిపెద్ద లైఫ్​సైన్సెస్​, హెల్త్​కేర్​ఫోరం బయోఏషియా. దాని 18వ ఎడిషన్ సదస్సులో పాల్గొనేందుకు హెమాహెమీలు రానున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటు అనేక మంది టెక్నాలజీ, లైఫ్​సైన్సెస్​రంగాల నిపుణులు, విధాన రూపకర్తలు హాజరు కానున్నారు. ఈ ఏడాది కోవిడ్​–19, దాని ప్రభావంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ప్రపంచ ఆరోగ్యమే ప్రధానాంశంగా చర్చలు, ప్యానెల్ డిస్కషన్స్​ జరుగుతాయి.

ఫిబ్రవరి 22, 23 తేదీల్లో జరిగే బయోఏషియా సదస్సులో మైక్రోసాఫ్ట్​ సీఈఓ సత్య నాదెళ్ల, డీడీపీ డిప్యూటీ డైరెక్టర్ ​జనరల్​ప్రోగ్రామ్స్​ డా.సౌమ్యస్వామినాధన్​, ఎఫ్డీఏ డైరెక్టర్​ డా.పీటర్​మార్క్స్, నీతి అయోగ్​సభ్యుడు డా.వీకే పాల్​, సీఈపీఐ సీఈఓ డా.రిచర్డ్​హచెట్​, గ్లోబల్​హెల్త్​గేట్స్​ ఫౌండేషన్​ ప్రెసిడెంట్​ డా.ట్రెవర్​ముందెల్​ తదితరులు ప్యానెల్ ​డిస్కషన్స్​లో పాల్గొంటారు.

‘చర్చ 2021– హెల్త్​కేర్​’ అనే అంశంలో సత్య నాదెళ్లతో పాటు మంత్రి కేటీ రామారావు పాల్గొంటారు. హెల్త్​కేర్​లో అవకాశాలు, టెక్నాలజీ వినియోగం, లైఫ్​సైన్సెస్​పై మాట్లాడుతారని నిర్వాహకులు పేర్కొన్నారు. రెండు రోజుల పాటు జరిగే అనేక అంశాలపై ప్రపంచ స్థాయి నిపుణులు, పాలసీ మేకర్స్ మాట్లాడుతారు. ఈ మేరకు షెడ్యూల్​ను విడుదల చేశారు.


Next Story

Most Viewed