- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)లో ఫ్రాడ్ కేసులో నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ డొమినికా జైలులో ఉన్న ఫొటోలు బయటికి వచ్చాయి. ఆయన ముంజేతికి గాయాలైనట్టుగా ఆ చిత్రాల్లో కనిపించింది. బ్లూ కలర్ టీ షర్టు వేసుకున్న చోక్సీ చేతి గాయాలను చూపుతూ కనిపించారు. పీఎన్బీలో ఫ్రాడ్ కేసు వెలుగులోకి బాహాటంగా రాకమునుపే ఆయన దేశం వదిలి అజ్ఞాతంలోకి వెళ్లారు. తర్వాత కరీబియన్ దేశం ఆంటిగ్వాలో తలదాచుకుంటున్నట్టు తెలిసింది. అక్కడే పౌరసత్వం తీసుకున్నారు. ఉన్నట్టుండి అక్కడ అదృశ్యమై డొమినికా దేశంలో కనిపించారు. ఆయనను భారత్కు అప్పగించాలని ఆంటిగ్వా ప్రయత్నిస్తున్న తరుణంలో ఆయన తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. తాజాగా, డొమినికా దేశంలోని ఓ జైలులో ఉన్న చోక్సీ చిత్రాలు మీడియాకు అందాయి.
Next Story