మెడికవర్‌‌కు చేరుకున్న మెగా ఫ్యామిలీ.. సాయి తేజ్ అపోలో‌కు తరలింపు

by  |
మెడికవర్‌‌కు చేరుకున్న మెగా ఫ్యామిలీ.. సాయి తేజ్ అపోలో‌కు తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్ : రాయదుర్గం కేబుల్ బ్రిడ్జి సమీపంలో రోడ్డు ప్రమాదంలో.. హీరో సాయి ధరమ్‌తేజ్ తీవ్రగాయాల పాలు అయిన సంగతి తెలుసుకున్న టాలీవుడ్, ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి చెందిన ప్రముఖులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. హుటాహుటిన హైటెక్ సిటీలోని మెడికవర్ ఆస్పత్రికి పరుగులు పెట్టారు. మెగా స్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అరవింద్, సోదరుడు వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, నిహారిక, నటుడు సందీప్ కిషన్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు.

సుప్రీం హీరో ఆరోగ్యంపై మెగా ఫ్యామిలీ డాక్టర్ల నుంచి ఆరా తీసిన అనంతరం పలు టెస్టులు చేయించారు. ఇంటర్నల్‌గా ఇంకేమైనా గాయాలు అయ్యాయా అనేది తెలియాల్సి ఉండగా.. మెరుగైన చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు. మొత్తానికి సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాద వార్త టాలీవుడ్‌ వర్గాలను కలవరపెట్టింది.

మెగాస్టార్ చిరంజీవి పేరుతో అఫిషీయల్ అనౌన్స్‌మెంట్..

సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేసినట్టు ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. దాని సారాంశం ప్రకారం.. ధరమ్ తేజ్ రికవరీ అవుతున్నట్టు ఉంది. డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు.. అంటూ ప్రమాదం ఏమి లేదని ట్వీట్ చేశారు.. కానీ అది చిరు అధికారిక ప్రకటన కాదని ట్విట్టర్‌ను పరిశీలిస్తే తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే గతంలో సాయి ధరమ్ తేజ్ పలు ప్రమాదాల్లో మానవత్వం చాటిన వీడియోలను కూడా నెటిజన్లు షేర్ చేస్తూ గెట్ వెల్ సూన్ సాయి ధరమ్ తేజ్ హ్యాష్‌ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story