రంజాన్ ప్రార్థనలు ఇళ్లల్లోనే చేసుకోవాలి: ఎస్పీ చందన దీప్తి

by  |
రంజాన్ ప్రార్థనలు ఇళ్లల్లోనే చేసుకోవాలి: ఎస్పీ చందన దీప్తి
X

దిశ, మెదక్: రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో ముస్లింలు తమ ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని ఎస్పీ చందన దీప్తి సూచించారు. లాక్‌డౌన్ అమలులో ఉన్నందున ముస్లింలు ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించాలని కోరారు. నిత్యావసరాలు, పండ్లు తీసుకోవడానికి బయటకు వస్తే ఎక్కడా గుమికూడ వద్దన్నారు. అదే విధంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్దంగా వాట్సాప్ గ్రూపుల్లో అనవసర పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

Tags: ramadan,prayer, do home, medak sp chandana deepthi


Next Story

Most Viewed