దంతెవాడలో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మహిళా మావోయిస్టులు హతం

by  |
encounter
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గడ్‌లోని దంతెవాడలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. అద్వాల్, కుంజేరా అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా, చనిపోయిన ముగ్గురు మావోయిస్టుల మీద ఒక్కక్కరిపై గతంలో ప్రభుత్వం రూ.5లక్షల రివార్డును ప్రకటించింది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed