మావోయిస్టుల చేతిలో టీఆర్ఎస్ నేత‌ హతం

by  |
మావోయిస్టుల చేతిలో టీఆర్ఎస్ నేత‌ హతం
X

దిశ, ఏటూరునాగారం: ములుగు జిల్లా అధికార పార్టీ చెందిన టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావును మావోయిస్టులు హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటన వెంకటాపురం మండలం‌ ఆలుబాక గ్రామంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… శనివారం రాత్రి కొందరు మావోయిస్టులు ఆయన ఇంటికి వచ్చి మాట్లాడే పని ఉందని చెప్పి బలవంతంగా బయటకు తీసుకొచ్చి కత్తితో పొడిచి చంపారని కుటుంబసభ్యులు తెలిపారు. ఎంత బతిమిలాడినా వదలలేదని వాపోయారు. అయితే ఘటనా స్థలంలో మావోలు ఓ లేఖను వదిలివెళ్లారు. పోలీసులకు సహకరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడనే ఆరోపణలపై భీమేశ్వరావును హత్య చేసినట్టు లేఖలో పేర్కొన్నారు.



Next Story

Most Viewed