- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ఏపీ బ్యూరో: కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన వ్యక్తి అదృశ్యమయ్యాడంటూ గుంటూరు జీజీహెచ్లో మహిళ ఆక్రందన ఆకాశాన్నంటుతోంది. తిరగని వార్డు లేదు, అడగని మనిషి లేడు అన్న చందాన ఆమె తన భర్త ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఈ నెల 14వ తేదీన తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా నిర్ధారణ కావడంతో సదరు వ్యక్తి అడ్మిట్ అయ్యాడు. సరైన వైద్య సదుపాయాలు లేవంటూ ఆయనను తెనాలి ఆసుపత్రి నుంచి 16వ తేదీ రాత్రి గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ఆ తరువాత అతని ఆచూకీలేకుండా పోయింది. అప్పటి నుంచి అతని భార్య వెంకాయమ్మ అతని ఆచూకీ కోసం రెండు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతోంది. తన భర్త ఏమయ్యాడో చెప్పాలంటూ కన్నీటి పర్యంతమవుతోంది. 12 రోజులుగా ఆమె జీజీహెచ్ అధికారుల కాళ్లావేళ్లా పడుతోంది.
Next Story