పిడుగుపాటు.. సెల్‌ఫోన్ పేలి ఒకరు మృతి

by  |
పిడుగుపాటు.. సెల్‌ఫోన్ పేలి ఒకరు మృతి
X

దిశ, నల్లగొండ: నకిరేకల్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ అకాల వర్షం ఇద్దరిని బలిగొంది. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని కడపర్తి గ్రామంలో దోమలపల్లి అంజయ్య(35) తన నిమ్మతోటలో నిమ్మకాయలు ఏరుతుండగా పిడుగుపడి తన జేబులో ఉన్న సెల్‌ఫోన్ పేలి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఘటనలో నకిరేకల్ పట్టణంలోని శివాజీ నగర్‌కు చెందిన అబ్బగోని వెంకన్న(55) అనే గీత కార్మికుడు బాబాన్‌సాహేబ్ గూడెం వద్ద కల్లు గీసి తిరిగి సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా భారీ వర్షం కారణంగా హైవే‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు కింద పడి సాహేబ్ అక్కడిక్కడే మృతిచెందాడు.


Next Story

Most Viewed