కరోనా భయం.. రైలు కిందపడి వ్యక్తి సూసైడ్

by  |
train suicide
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరోనా భయంతో ఓ వ్యక్తి రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాపట్ల మండలం అప్పిగట్లకు చెందిన 72ఏళ్ల వ్యక్తి ధనుంజయ చిన్న కుమారుడితో కలిసి ఉంటున్నారు. ఇదే క్రమంలో చిన్న కొడుకు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. దీంతో భయానికి గురైన ధనుంజయ ఆదివారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

సమాచారం తెలుసుకున్న ధనుంజయ పెద్దకొడుకు ఘటనాస్థలికి వెళ్లి డెడ్ బాడీని గుర్తించాడు. అనంతరం ధనుంజయ మృతదేహాన్ని ప్రభుత్వఆస్పత్రికి తరలించి.. కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. కొవిడ్ 19 ప్రోటోకాల్ ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.



Next Story

Most Viewed