వ్యక్తి ఆత్మహత్య.. కారణం అదే అంటున్న కుటుంబసభ్యులు

by  |
వ్యక్తి ఆత్మహత్య.. కారణం అదే అంటున్న కుటుంబసభ్యులు
X

దిశ, నిర్మల్ : మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని లక్ష్మణచాంద మండలంలోని రాచాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. గ్రామానికి చెందిన గొల్లవెల్మ రాఙేశ్వర్(54) అనే వ్యక్తి మద్యానికి బానిసై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ.యూనిస్ హైమద్ అలీ తెలిపారు. గొల్లవెల్మ రాఙేశ్వర్ అనే వ్యక్తి నిత్యం తాగివచ్చేవాడని, అందులో భాగంగానే శనివారం రాత్రి తప్ప తాగి వచ్చి, ఇంట్లో ప్రత్యేక గదిలో పడుకున్నాడని, తాగిన మైకంలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ.వివరించారు.



Next Story

Most Viewed