- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధిష్టానం ప్రజాస్వామ్య బద్ధంగా నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుందన్నారు. రోజుల తరబడి అందరితో చర్చించి ఏఐసీసీ ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి నియామకం విషయంలో కోమటిరెడ్డి టీపీసీసీ ఇన్చార్జీ మణిక్కమ్ ఠాగూర్ను నిందించడం పార్టీ క్రమశిక్షణా రహిత్యమని పేర్కొన్నారు. ఏదైనా అభిప్రాయ బేధాలు ఉంటే పార్టీ అంతర్గతంగా చర్చించాలని సూచించారు. పార్టీ నిర్ణయానికి పార్టీ శ్రేణులు కట్టుబడి ఉండాల్సేందే అన్నారు.
Next Story