చిత్తూరులో ట్రావెల్స్ బస్సు బోల్తా.. ముగ్గురు మృతి!

by  |
చిత్తూరులో ట్రావెల్స్ బస్సు బోల్తా.. ముగ్గురు మృతి!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా, మరో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదం జిల్లాలోని మదనపల్లి-పుంగనూరు మార్గంలో మంగళవారం మధ్యాహ్నం వేళ వెలుగులోకి వచ్చింది.

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని బాధితులు చెబుతున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed