మహేష్, పైడిపల్లి సినిమాకే ఫ్యాన్స్ ఓటు

by  |
మహేష్, పైడిపల్లి సినిమాకే ఫ్యాన్స్ ఓటు
X

సూపర్ స్టార్ మహేష్ బాబు , డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వచ్చిన ‘మహర్షి’ సినిమా సూపర్ హిట్ అయింది. అందుకే మళ్లీ ఆ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తే బాగుంటుందని అనుకున్నాడు మహేష్. అందుకే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత మళ్లీ అతనికే డైరెక్షన్ ఛాయిస్ ఇచ్చేశాడు. కానీ ఇప్పటి వరకు ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయలేదట వంశీ పైడిపల్లి. దీంతో మహేష్ తన 27వ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ మరో డైరెక్టర్‌కు ఇద్దామని అనుకుంటున్నాడట. వంశీతో సినిమాను తాత్కాలికంగా నిలిపేసి… మరిన్ని స్క్రిప్ట్‌లు వినాలనే నిర్ణయానికి వచ్చాడట.

ఈ క్రమంలోనే ‘గీతా గోవిందం’ దర్శకులు పరశురాం మహేష్‌కు త్వరలో కథను వినిపించబోతున్నాడట. అది గనుక నచ్చితే సినిమా పట్టాలెక్కనుంది. మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటుందట. కానీ ఈ మధ్య కాలంలో వంశీపైడిపల్లి సినిమాలో మహేష్ గ్యాంగ్ స్టర్‌గా, ప్రొఫెసర్‌గా కనిపించబోతున్నాడని వార్తలు వచ్చాయి. సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘భాషా’ సినిమాను మించిన కథ, కథనంతో ఆకట్టుకుంటుందనే న్యూస్‌తో ఆనందపడిపోయిన మహేష్ ఫ్యాన్స్… పైడిపల్లి స్క్రిప్ట్ రెడీ చేసుకునే వరకు ఆగాలని కోరుతున్నారు. సక్సెస్ స్వింగ్‌లో ఉన్న మహేష్ .. పైడిపల్లి సినిమాకు ఓకే చెప్తేనే బెటర్ అని అభిప్రాయపడుతున్నారు.

‘భక్త కన్నప్ప’ రీమేక్‌పై ‘బాహుబలి’ నిరాశ


Next Story