- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సినిమా : దేశవ్యాప్తంగా కరోనా విపత్కర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు మాస్క్ ఇంపార్టెన్స్ గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో కొవిడ్ గురించి ట్విట్టర్ వేదికగా పలు ట్వీట్లు చేస్తూ వచ్చిన మహేశ్.. తాజాగా ప్లాస్మా దానం చేయాలంటూ సైబరాబాద్ పోలీసులు పోస్ట్ చేసిన వీడియోపై స్పందించారు. కరోనాతో పోరాడుతున్న వారికి మనవంతు సాయం చేద్దామని, ప్లాస్మాదానం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు సీపీ సజ్జనార్, సైబరాబాద్ పోలీసుల చొరవకు మద్దతు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. ఇక మహేశ్ వాయిస్ ఓవర్తో రూపొందించిన వీడియోను తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ‘జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్లో పడేశాడు. బీ అలర్ట్.. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మాస్కు తప్పనిసరిగా వాడండి’ అని సూచించాడు మహేశ్.
Next Story