చెరువులో విద్యార్థి మృతదేహం..

by Vemula.Srinu Prasad |

<p>దిశ, గుంటూరు మూడు రోజుల కిందట అదృశ్యమైన తొమ్మిదో తరగతి విద్యార్థి కాటూరి చెరువులో విగతజీవిగా కనిపించాడు.ఈ ఘటన గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం గోగులమూడిలో శనివారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే..గుంటూరు జిల్లాలోని సెయింట్ ఇగ్నీషియస్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న మహేశ్ అనే విద్యార్థి కనిపించకుండా పోయాడు. సరిగ్గా మూడ్రోజుల తర్వాత అనుమానాస్పద స్థితిలో కాటూరి చెరువులో మృతదేహం కనిపించింది. తన చావుకు ప్రేమ వ్యవహారమే కారణమంటూ సూసైడ్ నోట్ లభించినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఆ [&hellip;]</p>

దిశ, గుంటూరు
మూడు రోజుల కిందట అదృశ్యమైన తొమ్మిదో తరగతి విద్యార్థి కాటూరి చెరువులో విగతజీవిగా కనిపించాడు.ఈ ఘటన గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం గోగులమూడిలో శనివారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే..గుంటూరు జిల్లాలోని సెయింట్ ఇగ్నీషియస్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న మహేశ్ అనే విద్యార్థి కనిపించకుండా పోయాడు. సరిగ్గా మూడ్రోజుల తర్వాత అనుమానాస్పద స్థితిలో కాటూరి చెరువులో మృతదేహం కనిపించింది. తన చావుకు ప్రేమ వ్యవహారమే కారణమంటూ సూసైడ్ నోట్ లభించినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఆ నోట్‌లో విద్యార్థి సంతకం కాకుండా వేలిముద్ర ఉండటం పలు అనుమానాలకు దారితీసింది.విద్యార్థి మృతిపై డీఈవో గంగాభవాని విచారణకు ఆదేశించారు. ఈ ఘటనలో విచారాణాధికారిగా పెదనందిపాడు ఎంఈవో బాలసుబ్రహ్మణ్యాన్ని నియమించారు.

Next Story