సర్కార్ వారి పాటకు ముందుగానే మహేశ్ సెలెబ్రేషన్స్

by  |
సర్కార్ వారి పాటకు ముందుగానే మహేశ్ సెలెబ్రేషన్స్
X

దిశ, వెబ్ డెస్క్ :
సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కార్ వారి పాట’కు వీసా అడ్డంకులు ఎదురైన విషయం తెలిసిందే. ఈ నెల మొదటి వారం నుంచి అమెరికాలో షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉన్నా.. యూనిట్ సభ్యులందరికీ వీసా అప్రూవ్ కాకపోవడంతో షెడ్యూల్ చేంజ్ అయింది. దీంతో జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు డిసైడ్ అయ్యారు దర్శక, నిర్మాతలు. 45 రోజుల పాటు షూటింగ్ జరగనుండగా.. అంతకు ముందుగానే మహేశ్ అమెరికా వెళ్లనున్నారని, ఫ్యామిలీతో కలిసి అక్కడే క్రిస్మస్, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకోనున్నారని సమాచారం. కాగా విదేశాల్లో షూటింగ్ ఉన్న ప్రతిసారీ ఫ్యామిలీని కూడా తీసుకెళ్తూ ఉంటాడు మహేశ్.

ఇక పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న సర్కార్ వారి పాటలో కీర్తి సురేష్ హీరోయిన్ కాగా.. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మహేశ్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడని టాక్.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed