ఆ రెండు రాష్ట్రాల్లోనే 194 కరోనా కేసులు

by  |
ఆ రెండు రాష్ట్రాల్లోనే 194 కరోనా కేసులు
X

ముంబయి: దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్నది. కరోనా పాజిటివ్ కేసులు 500కు చేరువవుతున్నాయి. ఇప్పటివరకు పదిమంది ఈ వైరస్ కు బలయ్యారు. మహారాష్ట్ర, కేరళలో కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య వంద(101) దాటింది. కేరళలో 93 కేసులు నమోదయ్యాయి. ఇందులో సోమవారం ఒక్కరోజే 28 కేసులు నమోదయ్యాయి. దీంతో సోమవారం అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌అమల్లోకి వచ్చింది. ఈ రెండు రాష్ట్రాలలోనే 194 కేసులు నమోదవడం గమనార్హం. మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.

Tags: coronavirus, lockdown, maharashtra, kerala, highest

Next Story