రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

by  |
రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
X

దిశ, ఏపీ బ్యూరో : ఓ ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలు శివారు పెళ్లూరు వద్ద చోటుచేసుకుంది. మృతుడు చీమకుర్తి మండలం బూదవాడకు చెందిన మద్ది వెంకట సాయి కృష్ణగా పోలీసులు గుర్తించారు. యువతిది కూడా చీమకుర్తిగా భావిస్తున్నారు. వారిద్దరూ ఒంగోలులోని దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్​కళాశాలలో చదువుతున్న విద్యార్థులని పోలీసులు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed