మాజీ ప్రియుడి దుర్మార్గం.. రమ్మంటే రాలేదని దారుణ హత్య

by  |
bihar
X

దిశ, కుత్బుల్లాపూర్ : వివాహితను హత్య చేసిన మాజీ ప్రియుడు నగలతో పరారయ్యాడు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ బాలరాజు కథనం ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన పూజ(21)కి ఈ ఏడాది ఏప్రిల్‌లో అదే రాష్ట్రానికి చెందిన రాజేంద్రన్ వర్మ అనే యువకుడితో వివాహం జరిగింది. అనంతరం ఆలుమగలిద్దరూ ఉపాధి కోసం కుత్బుల్లాపూర్ సర్కిల్ వినాయక నగర్‌కు వలస వచ్చి ఉంటున్నారు. అయితే, పెళ్ళైన తర్వాత కూడా ఆ యువతి మాజీ ప్రియడు రాకేశ్‌తో చాటింగ్, ఫోన్‌లో మాట్లాడుతున్నదని సమాచారం.

రోజు మాదిరిగానే భర్త విధులకు వెళ్లగా ఆమె మాజీ ప్రియుడు రాకెష్ తన స్నేహితుడితో కలిసి వినాయక నగర్‌కు వచ్చాడు. అతనితో రావాలని కోరగా నిరాకరించడంతో దిండును ముక్కుపై పెట్టి ఉపిరాడకుండా చేసి హత్య చేశాడని సమాచారం. అంతటితో ఆగకుండా ఆమె వద్ద ఉన్న బంగారు నగలను దోచుకెళ్లాడు. సాయంత్రం భర్త వచ్చేసరికి చనిపోయి ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చాడు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed