ప్రేమ చిచ్చు.. యువకుడిపై హత్యాయత్నం

by  |
Attempted murder
X

దిశ, ఏపీ బ్యూరో : కృష్ణా జిల్లాలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం కలకలం రేపింది. పుల్లూరు సమీపంలో భవానీపురం హోసింగ్ బోర్డుకు చెందిన డేవిడ్‌ను గుర్తు తెలియని దుండగులు బ్లేడ్‌తో గొంతు కోసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. అయితే డేవిడ్ గట్టిగా కేకలు వేయడంతో అతడిని శాంతినగర్ బుడమేరు కాలువలో పడేసి పరారయ్యారు. కాలువలో నుంచి ఎలాగోలా బయటపడ్డ డేవిడ్ ఆటో డ్రైవర్ సహాయంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ప్రస్తుతం బాధితుడు విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. డేవిడ్‌ను విచారించారు. అయితే డేవిడ్ ప్రేమ వ్యవహారమే హత్యాయత్నానికి కారణమైందా అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కంకిపాడుకు చెందిన ఓ యువతి సోషల్ మీడియా ద్వారా డేవిడ్‌కు పరిచయమైంది. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. ఈ విషయం తెలిసి యువతి అన్నయ్య, మరొక వ్యక్తి కలిసి డేవిడ్‌పై హత్యాయత్నం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యాయత్నం అనంతరం నిందితులు ఇబ్రహీంపట్నం-చత్తీస్‌ఘడ్ 30 నెంబర్ జాతీయ రహదారి పక్కన దుండగులు కారు వదిలేసి పరారయ్యారు. కారు ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.


Next Story

Most Viewed