బ్రేకింగ్ : తెలంగాణ ప్రభుత్వంపై లోకాయుక్త సీరియస్

by  |
బ్రేకింగ్ : తెలంగాణ ప్రభుత్వంపై లోకాయుక్త సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రభుత్వంపై లోకయుక్త సీరియస్ అయ్యింది. కరోనా నియంత్రణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యహరిస్తో్ందని మండిపడింది. కొవిడ్ మహమ్మారికి సంబంధించి రూల్స్ ఎవరూ పాటించడం లేదని, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ పెట్టుకోకపోవడం, పబ్లిక్ స్థలాల్లో స్మోకింగ్ పై సుమోటోగా కేసు నమోదు చేసింది. ఆంక్షలు కఠినంగా అమలు చేయకపోవడంపై లోకాయుక్త ఆగ్రహం వ్యక్తం చేసింది.

గుంపులుగా తిరగడం, మాస్క్ లేకపోవడం వలన కరోనా వ్యాప్తి జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అధికారులు కరోనా నియంత్రణపై అలస్వతం వహిస్తున్నారని లోకాయుక్త ఫైర్ అయ్యింది. యువకులు, ఉద్యోలు బయట ఫుడ్ స్టాల్స్, టీ స్టాల్స్ వద్ద గుమికూడుతున్నారని వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటికైనా ఆంక్షలు కఠినతరం చేయాలని, మాస్కు ప్రతిఒక్కరూ ధరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను ఈ 17కు వాయిదా వేసింది.



Next Story