- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండియా లాక్డౌన్@50 డేస్
<p>భారత్లో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ బుధవారం నాటికి 50 రోజులు పూర్తి చేసుకుంది. మార్చి 24 అర్థరాత్రి నుంచి ఏప్రిల్ 14 వరకు నిర్భంధం అమలులోకి వస్తుందని ప్రధాని మోడీ ప్రకటించారు. కేసుల సంఖ్య పెరుగుతుండటం, అన్నిరాష్ట్రాల సీఎంలతో చర్చించి వారి సూచన మేరకు మే 3 వరకు రెండోదశ లాక్డౌన్ పొడిగించారు.అనంతరం మూడోసారి మే 17వరకు నిర్బంధం పొడిగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మంగళవారం రాత్రి […]</p>

భారత్లో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ బుధవారం నాటికి 50 రోజులు పూర్తి చేసుకుంది. మార్చి 24 అర్థరాత్రి నుంచి ఏప్రిల్ 14 వరకు నిర్భంధం అమలులోకి వస్తుందని ప్రధాని మోడీ ప్రకటించారు. కేసుల సంఖ్య పెరుగుతుండటం, అన్నిరాష్ట్రాల సీఎంలతో చర్చించి వారి సూచన మేరకు మే 3 వరకు రెండోదశ లాక్డౌన్ పొడిగించారు.అనంతరం మూడోసారి మే 17వరకు నిర్బంధం పొడిగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ మే 18 నుంచి నాలుగో దశ లాక్ డౌన్ ప్రారంభం కానున్నట్టు సంకేతాలిచ్చారు. అయితే ఈ యాభై రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా 70,756 కరోనా కేసులు నమోదవ్వగా, 22,455 మంది చికిత్స అనంతరం కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కాగా, భారత్లో 2,293 కరోనా మరణాలు సంభవించాయి.






