ఆ మంత్రం జపిస్తే క్షణాల్లో నిద్ర ముంచుకొస్తుందంట..! మొబైల్ చూసే వారికి ఇదే చక్కటి చిట్కా!!

by Disha Web Desk 20 |
ఆ మంత్రం జపిస్తే క్షణాల్లో నిద్ర ముంచుకొస్తుందంట..! మొబైల్ చూసే వారికి ఇదే చక్కటి చిట్కా!!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రతి మనిషికి నిద్ర అనేది చాలా అవసరం. ఒక్క పూట నిద్ర కరువైనా ఆ రోజు ఆ మనిషి చాలా చిరాకుగా, నీరసంగా ఉంటారు. అంతే కాదు.. నిద్రలేమి సమస్యవల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. అయితే చాలా మంది ఈ మధ్య కాలంలో మానసిక ఒత్తిడి కారణంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మరికొంత మంది రాత్రివేళల్లో సెల్ ఫోన్ ఎక్కువగా వాడకానికి బానిసలై తెల్లవారు ఝాము వరకు నిద్రపోకుండా ఉంటారు. అయితే అదే అలవాటుతో సెల్ వాడని సమయంలో కూడా నిద్ర రాకుండా సతమతమవుతుంటారు. అయితే అలాంటి సమస్యల నుంచి బయటపడటానికి జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎవరికైతే అర్థరాత్రైనా నిద్రరాదో వారు ముందుగా కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తరువాత ఆ భగవంతున్ని ఒక్కసారి ధ్యానించుకుని ఓ మంత్రాన్ని చదవాలి. ఆ మంత్రం ఏంటంటే... అగస్తీ మార్ఘవశ్చైవ ముచుకుండే మహాబలః కపిలో మునిరాస్తికః పంచైతే సుఖశాయనః ఈ మంత్రాన్ని కాస్త కళ్లు మూసుకుని జపిస్తే నిద్ర ఇట్టే వచ్చేస్తుందట. అలా ఒకవారం రోజులు గడిచిన తరువాత ఎవరైతే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారో వారిలో వచ్చే మార్పును గమనించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లయినే వెంటనే ఈ మంత్రాన్ని పఠించండి.

Also Read..

ప్రాక్టీస్ లేదంటే పక్షులు కూడా శృతి తప్పుతాయి.. తాజా అధ్యయనం


Next Story

Most Viewed