102 మంది పిల్లలను కన్న వ్యక్తి.. చివరికి షాకింగ్ డెసిషన్!

by Dishanational2 |
102 మంది పిల్లలను కన్న వ్యక్తి.. చివరికి షాకింగ్ డెసిషన్!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఒకప్పటితో పోలిస్తే పిల్లల విషయంలో ఈ కాలం దంపతులు చాలా ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. పెళ్లికి ముందే పిల్లల విషయంలో ఓ నిర్ణయానికి వస్తున్నారు. ఒకరిద్దరికి మించి ఎక్కువగా పిల్లలను కనడానికి ఆసక్తి చూపడంలేదు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 102 మందికి జన్మనిచ్చాడు.

వివరాల్లోకి వెళ్లితే.. ఉగాండాలోని బుగిసాకు చెందిన మూసా హసహ్య అనే వ్యక్తికి 12 మంది భార్యలు ఉన్నారు. వీరందరికీ కలిపి 102 మంది పిల్లలు ఉన్నారు. అంతేకాదు మూసాకు మనవళ్ళు, మనవరాలు కలిపి 568 మంది ఉన్నారు.

అయితే వీరరందరినీ పోషించడం ప్రస్తుతం మూసాకు చాలా కష్టంగా మారిందంట. దీంతో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి పిల్లలను కనకూడదని నిర్ణయించుకున్నాడు. దీంతో పిల్లలను కనే ఏజ్‌లో ఉన్న తమ భార్యలకు కుటుంబనియంత్రణ మాత్రలు వాడమని తెలిపాడంట. అంతే కాదండోయ్.. ఎవరూ ఎక్కువ పెళ్లీలు చేసుకోకూడందటూ కోరుతున్నాడంట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతోంది.

Next Story

Most Viewed