- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ పేరు వినగానే గుర్తొచ్చేది చార్మినార్, ట్యాంక్ బండ్.. అవునూ ఇక్కడ ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. సాయంకాల సమయాన ప్రశాంతంగా ట్యాంక్ బండ్ ఒడ్డున కూర్చోవాలి అనుకోవడం చాలా మందికి కోరిక. అయితే ఎప్పుడూ వాహనాల చప్పుల్లతో, రద్దీగా ఉండే ట్యాంక్ బండ్ రోడ్ ప్రస్తుతం నిశబ్ధంగా, చూపరులను ఆకర్షించే విధంగా తయారయ్యింది. అవునండీ.. ఓ నెటిజన్ ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ కి విన్నవించిన విషయం ఇదే.
దీనికి స్పందించిన కేటీఆర్ ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకూ ట్యాంక్ బండ్ పై వాహనాలకు అనుమతించడం లేదు. దీంతో ఆదివారం పిల్లలతో సరదాగా గడిపేందుకు వచ్చేవారికి ప్రశాంత వాతావరణం దొరికినట్లైంది. ఇంకేం.. మీరూ ఓ సారీ వెళ్లి వచ్చేయండి. గుర్తుంచుకోండి ఇది కేవలం ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే.. అయితే ఇక్కడి వచ్చే వారు తప్పనిసరిగా కొవిడ్ రూల్స్ పాటించే విధంగా హైదరాబాద్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.