హసన్ పల్లి శివారులో చిరుతపులి సంచారం

by  |
హసన్ పల్లి శివారులో చిరుతపులి సంచారం
X

దిశ, నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలం హసన్ పల్లి శివారులో సోమవారం నాడు చిరుతపులి సంచారం చేస్తుందని గ్రామస్తులు తెలిపారు. గతంలో కూడా గ్రామంలో తిరిగి శివారు ప్రాంతాలలో గల మేకలను, గొర్రెలను చంపి తిన్నదని వెల్లడించారు.

సోమవారం నాడు చిరుతపులి పాదముద్రలు గమనించిన గ్రామస్తులు చిరుతపులి బారినుండి కాపాడాలని కోరుతున్నారు. గ్రామ శివారులో గల అటవీ ప్రాంతంలోని హెడ్ సీల్‌స్ ప్రాంతంలో ఈ చిరుత సంచరిస్తుందని భయాందోళనలకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతపులి బారీ నుండి కాపాడాలని వేడుకుంటున్నారు.


Next Story

Most Viewed