లక్ష్మీనగర్‎లో చిరుత పులి కలకలం

by  |
లక్ష్మీనగర్‎లో చిరుత పులి కలకలం
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం స్వర్ణ సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. లక్ష్మీనగర్ గ్రామంలో పులి ఆవుపై దాడి చేసింది. శని, ఆదివారాల్లో ఈ అటవీ ప్రాంతంలో పులి సంచరించినట్లు సమాచారం రావడంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. పులి సంచారంపై గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మహారాష్ట్ర సరిహద్దున ఉన్న ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు కాలినడకన రాకపోకలు చేస్తారు.


Next Story

Most Viewed