ఈటలను కలిసిన ఓ లీడర్..ఎందుకో?

by  |
ఈటలను కలిసిన ఓ లీడర్..ఎందుకో?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ను శనివారం ఉదయం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి వెళ్లి కలిసినట్టుగా తెలుస్తోంది. నిన్న రాత్రి నుండి ఎవరికీ టచ్ లో లేకుండా ఉన్న సదరు ప్రజాప్రతినిధి శామీర్‌పేట్‌లోని ఈటల ఇంటికి వెళ్లి పర్సనల్‌గా ముచ్చటించి వెల్లారని సమాచారం. ఈ విషయంపై హుజురాబాద్ ప్రాంతానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒకరు ధృవీకరించారు. ఈటలను ఆ నాయకుడు కలిసినట్టుగా బయటకు పొక్కడంతో ఇంటలీజెన్స్ వర్గాలు కూడా వివరాలు సేకరిస్తున్నారని సమాచారం. ఆయన ఈటలను కలవడానికి కారణాలు ఏంటీ, వారిద్దరు కలిసి ఏం మాట్లాడుకున్నారు. అన్న విషయాలు తెలుసుకుంటున్నారు.

Next Story

Most Viewed