వణికిస్తున్న మంచు తుఫాన్.. పది మంది మృతి

by Disha Web Desk 1 |
వణికిస్తున్న మంచు తుఫాన్.. పది మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ లో మంచు తుఫాను అరివీర భయంకరంగా ఉధృతమవుతోంది. విరామం లేకుండా భారీగా మంచు కురుస్తుండడంతో పలు వాహనాలు మంచులో ఎక్కడికక్కడే చిక్కుకుపోయాయి. మంచు తుఫాను ధాటికి ఇప్పటికే పది మంది మరణించారని, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి 35 మంది సంచార జాతుల వారు వలస వెళుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని, సహాయక చర్యలు కూడా నిర్విరామంగా కొనసాగుతున్నాయని సమాచారం.



Next Story

Most Viewed