యువతకు ఈటల రాజేందర్ మరో పిలుపు.. ఒకే సారి లక్ష మందితో..!

by  |
యువతకు ఈటల రాజేందర్ మరో పిలుపు.. ఒకే సారి లక్ష మందితో..!
X

దిశ, హుజురాబాద్ రూరల్: విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో లక్ష యువ గళ గీతార్చన వాల్ పోస్టర్‌ను మాజీ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాదులోని పరేడ్ గ్రౌండ్‌లో డిసెంబర్ 14 న లక్ష మంది యువతీ, యువకులు సామూహికంగా గీతా పారాయణం చేయనున్నట్లు చెప్పారు. భగవద్గీత జీవన గీత – ప్రేరణ గీత అని.. ఈ కార్యక్రమంలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ధర్మ చార్య ప్రముఖ్ తంగేడు నవనిత్ రావు, ఉపాధ్యక్షులు సుధాకర్ రావు, మండల అధ్యక్షులు రమేష్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.



Next Story