రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు: కునమనేని

by  |
రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు: కునమనేని
X

దిశ, పెద్దపల్లి: జిల్లాలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల రాజకీయ శిక్షణ తరగతుల సందర్భంగా.. 2వ రోజు ముఖ్య అతిథిగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కొత్తగూడెం మాజీ శాసన సభ్యులు కునమనేని సాంబశివ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రజా, రైతు, కార్మిక, వ్యతిరేఖ విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. ఇందుకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఏడాది పాటు సుదీర్ఘంగా పోరాటం కొనసాగించి.. కేంద్రం మెడలు వంచారన్నారు. అందుకే రైతు పోరాటం చారిత్రాత్మకమైనదని అభివర్ణించారు. ఇక రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందని మండిపడ్డారు. రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే ధాన్యం కొనుగోలు చేయమని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడం దారుణమన్నారు. ఇద్దరు కలిసి రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వారు ధ్వజమెత్తారు.


Next Story

Most Viewed