రేపు కల్నల్ సంతోష్ బాబు విగ్రహావిష్కరణ చేయనున్న కేటీఆర్

by  |
రేపు కల్నల్ సంతోష్ బాబు విగ్రహావిష్కరణ చేయనున్న కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి కేటీఆర్ మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. సూర్యాపేట, నకిరేకల్ నియోజకవర్గాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 1 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 3 గంటలకు సూర్యాపేటకు చేరుకొని కోర్టు చౌరస్తాలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహావిష్కరణ చేస్తారు. మధ్యాహ్నం 3:10 గంటలకు ఓల్డ్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో రోడ్డు విస్తరణ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డుకు శంకుస్థాపన, 3:45 గంటలకు నకిరేకల్ నియోజకవర్గంలోని కేతేపల్లి మండలం, బీమారం గ్రామంలో రైతు వేదిక, వైకుంఠ ధామం, హైస్కూల్ భవనాన్ని ప్రారంభం, 4 గంటలకు నకిరేకల్ పట్టణానికి చేరుకొని100 పడకల ఆసుపత్రికి, 4:10 గంటలకు వెజ్ మార్కెట్ యార్డుకు, 4:15 గంటలకు సీసీ రోడ్లు,డ్రైనేజీ పనులతో పాటు 4:30 గంటలకు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైకుంఠ దామంకు శంకుస్థాపన చేస్తారు. 4:45 గంటలకు రైతు వేదికను ప్రారంభించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు.


Next Story

Most Viewed