అక్కడ క్షుద్ర పూజలు.. భయం గుప్పిట్లో ప్రజలు

by  |
అక్కడ క్షుద్ర పూజలు.. భయం గుప్పిట్లో ప్రజలు
X

దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మారుమూల సూరారం గ్రామంలో క్షుద్ర పూజల కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ కూడలిలో మేకను బలి ఇచ్చి, నిమ్మకాయలు వేసి వెళ్లడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగినట్టు సమాచారం. ఇంత సాంకేతిక అభివృద్ధి చెందిన ఈ కాలంలోనూ క్షుద్ర పూజలు జరగడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Next Story