సోనియాతో కోమటిరెడ్డి కొత్త తరహా డిమాండ్

by  |
సోనియాతో కోమటిరెడ్డి కొత్త తరహా డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్ : టీపీసీసీ కోసం కాంగ్రెస్ అధిష్టానం ముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొత్త తరహాలో డిమాండ్ ప్రతిపాదించారు. బీజేపీలో బండి సంజయ్ కి ఇచ్చినట్టే పార్టీ మనిషికే అధ్యక్ష పదవి ఇవ్వాలని కోమటిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. టీపీసీసీ ఎంపిక నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు హస్తిన బాట పట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ పదవికి రాజీనామా చేసిన తరువాత పీసీసీ రేసులో తానే ఉన్నట్లు చెబుతూ వస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఆ పదవి కోసం కాంగ్రెస్ పెద్దలతో భేటీ అవుతున్నారు.

తాజాగా కోమటి రెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యేందుకు ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీలో బండి సంజయ్‌కి ఇచ్చినట్టే పార్టీ మనిషికే అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరనున్నట్లు చెప్పారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు ఎంతకాలం పార్టీలో ఉంటారో తెలియదని, పార్టీ ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే చూసుకుంటారని సోనియా గాంధీ తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు ఢిల్లీలో వార్తలు జోరందుకున్నాయి.

మరోవైపు పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్నా… పదవులు ఇవ్వక పోయిన పార్టీ కోసం పని చేస్తా. కమిటీ మీటింగ్ కోసం ఢిల్లీ వచ్చాను. వీలైతే రాహూల్ గాంధీ ని కలుస్తా. నేనూ పీసీసీ రేసులో ఉన్నా..పదవి ఆశిస్తే తప్పేముందని మీడియా మిత్రులతో కోమటి రెడ్డి అన్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed