జట్టుతో కలసి ఇంగ్లాండ్‌కు కేఎల్ రాహుల్

by  |
జట్టుతో కలసి ఇంగ్లాండ్‌కు కేఎల్ రాహుల్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ జట్టుతో కలసి ఇంగ్లాండ్ వెళ్లనున్నట్లు తెలుస్తున్నది. ఐపీఎల్ 2021 సమయంలో అపెండిసైటిస్ సర్జరీ జరగడంతో కొన్నాళ్లుగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. సర్జరీ అనంతరం కోలుకున్న కేఎల్ రాహుల్ ప్రస్తుతం ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన బయోబబుల్‌లో ఉన్నాడు. అయితే అతడి ఫిట్‌నెస్‌పై అనుమానాలు ఉండటంతో ఇంగ్లాండ్ వెళ్తాడా లేదా అనే సందిగ్దత నెలకొన్నది. తాజాగా అతడు పూర్తిగా కోలుకున్నాడని.. ప్రస్తుతం ఫిట్‌నెస్ పెంచుకునే పనిలో ఉన్నాడని సన్నిహితులు వెల్లడించారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు మరో నాలుగు వారాల సమయం ఉండటంతో అప్పటి లోగా పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధిస్తాడని జట్టు యాజమాన్యం భావిస్తున్నది. అందుకే అతడిని ఇంగ్లాండ్ తీసుకొని వెళ్లడానికి నిర్ణయించింది. గతంలో కూడా వృద్దిమాన్ సాహా గాయపడినా.. పూర్తిగా కోలుకోక ముందే భారత జట్టుతో పాటు అతడు ఆస్ట్రేలియా వెళ్లాడు. కాగా కేఎల్ రాహుల్, వృద్దిమాన్ సాహ భారత జట్టుతో ప్రయాణిస్తారని బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది.

Next Story

Most Viewed