ముంబై ఆశలపై SRH నీళ్లు.. ప్లే ఆఫ్స్‌కు చేరిన KKR

by  |
KKr
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2021 ప్లే ఆఫ్స్‌లో మిగిలిన చివరి బెర్తు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు దక్కింది. ఇప్పటికే ఢిల్లీ, చెన్నయ్, బెంగళూరు ప్లే ఆఫ్స్ బెర్తులను కన్ఫార్మ్ చేసుకున్నాయి. అయితే కోల్‌కతా 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కనుక ముంబై 170కి పైగా పరుగుల తేడాతో విజయం సాధించి ఉంటే మెరుగైన రన్‌రేట్‌తో ముంబై 4వ స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరేది. కానీ, ముంబై ఇండియన్స్ ఆశలపై సన్‌రైజర్స్ ఓపెనర్లు నీళ్లు చల్లారు. సన్‌రైజర్స్ బ్యాటర్లు వేగంగా ఆడుతూ పవర్ ప్లే లోనే 65కు పైగా పరుగులు సాధించారు. దీంతో ముంబై మ్యాచ్ గెలిచినా 170 పరుగుల భారీ తేడా లభించలేదు. దీంతో నాలుగో స్థానాన్ని కోల్‌కతా దక్కించుకున్నది.

ప్లే ఆఫ్స్:

అక్టోబర్ 10 : ఢిల్లీ క్యాపిటల్స్ Vs చెన్నయ్ సూపర్ కింగ్స్ (క్వాలిఫయర్ 1)

అక్టోబర్ 11 : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు vS కోల్‌కతా నైట్‌రైడర్స్ (ఎలిమినేటర్)

అక్టోబర్ 13 : క్వాలిఫయర్ 2

అక్టోబర్ 15 : ఫైనల్


Next Story

Most Viewed