రెమ్యునరేషన్ డబుల్.. కియారాకు ఎందుకంత డిమాండ్

by  |
kiara advani
X

దిశ, సినిమా : హాట్ బ్యూటీ కియారా అద్వానీ అటు బాలీవుడ్ ఇటు సౌత్ రెండింటిలోనూ బిజీ అయిపోయింది. ఇప్పటికే హిందీలో బిగ్ ప్రాజెక్ట్స్‌కు కమిట్ అయిన కియారా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – శంకర్‌ల పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో ఫిమేల్ లీడ్ ప్లే చేస్తోంది. ఇప్పటికే చెర్రీతో ‘వినయ విధేయ రామ’ సినిమా చేసిన భామ.. సెకండ్ టైమ్ #RC15లో చరణ్‌తో జోడీ కడుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జె్ట్‌తో తెరకెక్కుతోంది.

ఈ సినిమాకు కియారా తీసుకున్న రెమ్యునరేషన్ విషయంలో పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ మూవీకి కియారా ఏకంగా రూ.5 కోట్లు తీసుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. పాన్ ఇండియా అప్పీల్ కోసం సౌత్ స్టార్ హీరోయిన్స్‌ను పక్కన పెట్టి కియారాను చూజ్ చేసుకున్న మేకర్స్.. ఇప్పటికే అడిగినంత ఇచ్చేశారని తెలుస్తోంది. ఇంతకు ముందు ప్రాజెక్ట్‌లకు కేవలం రూ. 2 కోట్లు మాత్రమే తీసుకున్న కియారా.. డిమాండ్ ఉంది కాబట్టి రెమ్యునరేషన్ డబుల్ చేసిందని టాక్.

బ్రేకింగ్: సూర్యాపేటలో సందడి చేసిన పీవీ సింధు..



Next Story

Most Viewed