సీఎం జగన్‌తో కియా మోటర్స్ ప్రతినిధులు భేటీ

by  |
సీఎం జగన్‌తో కియా మోటర్స్ ప్రతినిధులు భేటీ
X

దిశ, ఏపీ బ్యూరో: కియా మోటార్స్​ ప్రతినిధులు బుధవారం సీఎం జగన్​ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. తమ సంస్ధకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తోందని సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ కార్యకలాపాలు మరింత వేగంగా కొనసాగించడానికి తగు చర్యలు తీసుకున్నట్లు సీఎంకు వివరించారు. భవిష్యత్తులో దేశీయంగా తమ కార్ల వినియోగం పెద్ద ఎత్తున పెరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎంను కలిసినవారిలో సంస్థ ఎండీ కూక్‌ హ్యూన్‌ షిమ్, కియామోటార్స్‌ లీగల్‌ హెచ్‌ఓడీ జుడే లి, ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ సోమశేఖర్‌ రెడ్డి ఉన్నారు.


Next Story