‘కియా’ నుంచి మరో కొత్త వేరియంట్.. ధర ఎంతంటే..?

by  |
‘కియా’ నుంచి మరో కొత్త వేరియంట్.. ధర ఎంతంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ కియో మోటార్స్ ఇండియా తన కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెల్టోస్‌లో కొత్తగా రెండు వేరియంట్లను మార్కెట్లో విడుదల చేసింది. కియా సెల్టోస్ ఎక్స్ లైన్ 7 డీసీటీ పేరుతో తెచ్చిన ఈ వేరియంట్ రూ. 17.79 లక్షల(ఎక్స్‌షోరూమ్) వద్ద ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. ఇందులోనే ఎక్స్ లైన్ 6 ఏటీ వేరియంట్ రూ. 18.1 లక్షలని కంపెనీ స్పష్టం చేసింది. ఈ కొత్త వేరియంట్ల ద్వారా సెల్టోస్ కారు దేశీయ మార్కెట్లో మరింత ప్రత్యేకంగా నిలుస్తుందని కంపెనీ అభిప్రాయపడింది. ఈ కొత్త వేరియంట్లు మ్యాట్ గ్రాఫైట్‌లో 18 అంగుళాల అలాయ్ వీల్స్‌తో పాటు పూర్తి అధునాతన ఫీచర్లతో అందుబాటులో ఉండనుంది.

‘భారత మార్కెట్‌లో సంస్థ ప్రయాణానికి అత్యంత విలువైన మోడల్‌గా సెల్టోస్ ఉంది. దేశీయంగా ఎస్‌యూవీ విభాగంలో ప్రీమియం వాహనం ఇది. వినియోగదారుల నుంచి ప్రత్యేక ఆదరణ ఉన్న ఈ మోడల్ విషయంలో అన్ని రకాల ప్రయోజనాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని’ కియా ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అమ్మకాల విభాగానికి చెందిన టె-జిన్ అన్నారు. సెల్టోస్ ఎక్స్ లైన్ రెండూ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో లభిస్తుంది. ఎక్స్‌లైన్ 7 డీసీటీ పెట్రోల్ వేరియంట్‌లోనూ, 6ఏటీ వేరియంట్ డీజిల్ వేరియంట్‌లో ఉండనున్నట్టు కంపెనీ వెల్లడించింది.



Next Story

Most Viewed