తెరుచుకోనున్న కేదరీనాథ్, బద్రీనాథ్ ఆలయాలు

by  |
తెరుచుకోనున్న కేదరీనాథ్, బద్రీనాథ్ ఆలయాలు
X

డెహ్రాడూన్: ఉత్తరఖండ్‌లోని చమోలీ, రుద్రప్రయాగ్, ఉత్తర కాశీల్లోని స్థానికుల కోసం జూన్ 15 నుంచి చార్‌ధామ్ యాత్రను ప్రారంభించనున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి, ప్రభుత్వ అధికార ప్రతినిధి సుభోద్ యునియాల్ తెలిపారు. రుద్రప్రయాగ్‌లోని స్థానికుల కోసం కేదరినాథ్ ఆలయాన్ని, చమోలీ జిల్లాలో ప్రజల కోసం బద్రీనాథ్ ఆలయాన్ని, ఉత్తర కాశీ వారి కోసం గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరవనున్నట్టు తెలిపారు. ఆలయాలకు వచ్చే భక్తులు నెగెటివ్ ఆర్టీపీసీఆర్ రిపోర్టుతో రావాలని వెల్లడించారు. కాగా రాష్ట్రంలో కర్ఫ్యూను 15 నుంచి 22 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.



Next Story

Most Viewed