సర్కార్ కీలక నిర్ణయం .. వారందరికీ రూ.5 వేలు ఇస్తాం

by  |
సర్కార్ కీలక నిర్ణయం .. వారందరికీ రూ.5 వేలు ఇస్తాం
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో ప్రజల ప్రాణాలు కాపాడడంలో వైద్యాధికారులు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అయితే వైరస్ బారీన పడిన వారి పరిస్థితి విషమిస్తే.. ప్లాస్మా థెరపి చేయడం ద్వారా కోలుకుంటారని ఆ చికిత్సను ఎంచుకుంటున్నారు. ఇందుకోసం కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా ధానం చేయాలని అధికారులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక వైద్య విద్య మంత్రి సుధాకర్ ప్లాస్మా దానం చేసేవారికి బహుమానం ప్రకటించాడు. ప్లాస్మా దానం చేస్తోన్న ఒక్కొక్కరికి రూ. 5 వేలు ప్రొత్సాహం ఇస్తామని తెలిపారు. దీనిని మరోలా భావించవద్దని.. ఒకరి ప్రాణాలు కాపాడుతున్న మీకు ప్రభుత్వం తరఫుణ ప్రొత్సాహం అందిస్తున్నామని చెప్పుకొచ్చారు.


Next Story

Most Viewed