దళిత బంధుపై కరీంనగర్ కలెక్టర్ కీలక వ్యాఖ్యలు..

by  |
దళిత బంధుపై కరీంనగర్ కలెక్టర్ కీలక వ్యాఖ్యలు..
X

దిశ, కరీంనగర్ సిటీ : హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకంపై వస్తున్న పుకార్లు నమ్మవద్దని, ఇప్పటివరకు లబ్ధిదారుల ఎంపిక సర్వే మాత్రమే పూర్తైందని జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ తెలిపారు. సెగ్మెంట్లో ఎవరికి కూడా దళిత బంధు పథకం మంజూరు చేయలేదని, ఈ నెల 16న జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి హుజురాబాద్‌లో లాంఛనంగా ప్రారంభిస్తారని వెల్లడించారు.

ప్రతీ దళిత కుటుంబానికి ఈ పథకం మంజూరు చేయబడుతుందని, నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఉన్న గ్రామాల్లో ప్రత్యేక అధికారులు లబ్ధిదారుల సర్వే చేయగా, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుందని తెలిపారు. లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శుక్రవారం ఓ ప్రకటనలో కలెక్టర్ కర్ణన్ స్పష్టం చేశారు.


Next Story

Most Viewed