- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీజీటీఐ బోర్డు సభ్యుడిగా కపిల్ దేవ్
<p>దిశ, స్పోర్ట్స్ : భారత జట్టు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ ఆటకు గుడ్బై చెప్పిన తర్వాత ప్రొఫెషనల్ గోల్ఫర్గా మారిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా గోల్ప్ ఆడుతున్న కపిల్ దేవ్ తాజాగా ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఇండియా (పీజీటీఐ) బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని పీజీటీఐ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో గోల్ఫ్ క్రీడకు మరింత ప్రచారం తీసుకొని రావడానికి కపిల్ నియామకం ఉపయోగపడుతుందని బోర్డు పేర్కొన్నది. ‘నన్ను పీజీటీఐ బోర్డు […]</p>

దిశ, స్పోర్ట్స్ : భారత జట్టు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ ఆటకు గుడ్బై చెప్పిన తర్వాత ప్రొఫెషనల్ గోల్ఫర్గా మారిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా గోల్ప్ ఆడుతున్న కపిల్ దేవ్ తాజాగా ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఇండియా (పీజీటీఐ) బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని పీజీటీఐ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో గోల్ఫ్ క్రీడకు మరింత ప్రచారం తీసుకొని రావడానికి కపిల్ నియామకం ఉపయోగపడుతుందని బోర్డు పేర్కొన్నది.
‘నన్ను పీజీటీఐ బోర్డు సభ్యుడిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ బోర్డులో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉన్నది. దేశంలో గోల్ఫో క్రీడకు ఇప్పుడే ఆదరణ పెరుగుతున్నది. రాబోయే రోజుల్లో ఇండియాలో కూడా టూర్ ప్రోగ్రామ్స్ జరగడానికి కృషి చేస్తాను. క్రికెట్తో పాటు ఇతర క్రీడలను కూడా అభివృద్ది చేయడంలో తగినంత పాత్ర పోషిస్తాను’ అని కపిల్ అన్నాడు.






